rss: ఆరెస్సెస్ నాయకుడి హత్యను ఖండించిన రాహుల్ గాంధీ

  • లూథియానాలో ఆరెస్సెస్ నేత హత్య
  • హత్యపై ట్విట్టర్లో రాహుల్ స్పందన
  • హింసను ఎవరు ప్రేరేపించినా తప్పేనంటూ ట్వీట్

ఆరెస్సెస్ కార్యకర్తలపై పలుచోట్ల జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. సంఘ్ నేత రవీందర్ గోస్వామిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నిన్న ఉదయం లూథియానాలో హత్య చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందించారు. గోస్వామి హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. హింసను ఎవరు ప్రేరేపించినా తప్పేనని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ సామరస్యంగా మెలగాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. 

More Telugu News