salman khan: 'దెబ్బతిన్న పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్!

  • ‘ఏక్‌ థా టైగర్‌’ కు సీక్వెల్ గా ‘టైగర్‌ జిందా హై’
  • రా ఏజెంట్ గా సల్మాన్.. ఐఎస్ఐ ఏజెంట్ గా కత్రినా కైఫ్
  • ‘టైగర్‌ జిందా హై’ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సల్మాన్

'నచ్చిందా? మళ్లీ క్రిస్ మస్ కి కలుద్దాం' అంటూ సల్లూభాయ్‌ అభిమానుల ముందుకు వచ్చాడు. 'ట్యూబ్ లైట్' సినిమాతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సల్మాన్ ఖాన్, ‘ఏక్‌ థా టైగర్‌’ సీక్వెల్ అయిన ‘టైగర్‌ జిందా హై’తో మళ్లీ హిట్ కొట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తో మరోసారి ఇందులో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ హిట్ పెయిర్ గా బాలీవుడ్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దీపావళిని పురస్కరించుకుని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సల్మాన్ ‘టైగర్‌ జిందా హై’ ఫస్ట్‌ లుక్‌ ను రివీల్ చేశాడు. ‘ఏక్‌ థా టైగర్‌’ లో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన సల్మాన్ ఇక్కడ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్‌ కనిపిస్తోంది. అలాగే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ పై ‘దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు’ అన్న డైలాగ్‌ అభిమానులను అలరిస్తోంది. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు తొలి భాగానికి దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. 

More Telugu News