Shruti hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • స్పీడు తగ్గించానంటున్న శ్రుతి హాసన్ 
  • బాలకృష్ణ విడుదల చేసిన 'గరుడ వేగా' ట్రైలర్
  • చాలా కాలం తర్వాత విక్రం పూర్తి యాక్షన్ సినిమా 
  • మోహన్ బాబు కూతురుగా మలయాళ భామ!  

*  'ఎప్పుడూ స్పీడు పనికిరాదు..' అంటోంది బ్యూటీ క్వీన్ శ్రుతిహాసన్. గతంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసిన ఈ చిన్నది ఇప్పుడు బాగా తగ్గించేసింది. దీని గురించే అడిగితే, "అవును, గతంలో బాగా చేశాను. అయితే, ఎప్పుడూ ఆ స్పీడు పనిచేయదు. కాస్త స్లో అవ్వాలి. నేనూ అదే చేస్తున్నాను. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నాను. ఈ క్రమంలో సినిమాల సంఖ్య తగ్గింది" అని చెప్పింది.          
*  డా. రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగా' చిత్రం ట్రైలర్ ను నిన్న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 3న విడుదల చేయనున్నారు.
*  చాలా కాలం తర్వాత తమిళ నటుడు విక్రం నటిస్తున్న పూర్తి యాక్షన్ ప్రధాన చిత్రం 'స్కెచ్'. విజయచందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో థ్రిల్ ను కలిగించే యాక్షన్ సీన్స్ ఎన్నో వున్నాయట. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ నటుడు మోహన్ బాబు నటిస్తున్న 'గాయత్రి' చిత్రం తండ్రీకూతుళ్ల మధ్య బంధాల నేపథ్యంలో సాగుతుంది. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కూతురుగా 'మేడమీద అబ్బాయి' ఫేం నిఖిల విమల్ నటిస్తోంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది.      

More Telugu News