కేఈ కృష్ణమూర్తి: జగన్‌ గ్రామాల్లోకి వస్తే ప్రజలు నిలదీయాలి: కేఈ కృష్ణమూర్తి

  • కర్నూలు జిల్లా కొడుమూరులో మీడియాతో మాట్లాడిన కేఈ కృష్ణమూర్తి
  • బీసీల గురించి జగన్ ఏనాడూ పట్టించుకోలేదు
  • ఇప్పుడు మాట్లాడుతున్నారు
  • అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకోవడమే జగన్ ధ్యేయం

బీసీల గురించి ఏనాడూ పట్టించుకోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేఈ కృష్ణ‌మూర్తి.. జ‌గ‌న్ గ్రామాల్లోకి వస్తే ప్రజలు నిలదీయాలని వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా బీసీల గురించి మాట్లాడ‌ని జ‌గ‌న్‌కి ఇప్పుడు బీసీలు గుర్తుకువచ్చారని విమ‌ర్శించారు. తాము చేస్తోన్న అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకోవడమే జగన్ ధ్యేయంగా మారిందని అన్నారు. దేశంలో ఏ నాయ‌కుడూ చేయలేని విధంగా చంద్ర‌బాబు నాయుడు నదుల అనుసంధానం చేస్తున్నార‌ని చెప్పారు.

More Telugu News