taj mahal: మరి, ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని మోదీ ఆపేస్తారా?: అసదుద్దీన్ ఒవైసీ

  • తాజ్ మహల్ పై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ఒవైసీ
  • నిరుద్యోగం, ఉగ్రవాదంలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి
  • అనవసర వివాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

తాజ్ మహల్ పై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిపిందే. దేశ ద్రోహులు నిర్మించిన కట్టడం తాజ్ మహల్ అని... తాజ్ ను నిర్మించిన షాజహాన్ తన తండ్రినే నిర్బంధించాడని సంగీత్ కామెంట్ చేశారు. హిందువులను తుడిచిపెట్టేయాలనుకున్నాడని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ కట్టడాలన్నీ దేశద్రోహులు కట్టినవి అయినప్పుడు... ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని ప్రధాని మోదీ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ఉగ్రవాదం తదితర సమస్యలెన్నో ఉన్నాయని... వాటిని పరిష్కరించలేక, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనవసర అంశాలను వివాదాస్పదం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

More Telugu News