ntr: 'ఖైదీ నెంబర్ 150' రికార్డుకు చేరువలో 'జై లవ కుశ' .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆసక్తి!

  • ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'జై లవ కుశ' 
  • 'జనతా గ్యారేజ్' రికార్డును క్రాస్ చేసింది 
  • 'శ్రీమంతుడు' రికార్డును బీట్ చేసింది 
  • ఫస్ట్ ప్లేస్ కోసం ట్రై చేస్తోంది        

ఎన్టీఆర్ చెప్పినట్టుగానే .. ఆయన అభిమానులు ఆశించినట్టుగానే 'జై లవ కుశ' భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన జోరును కొనసాగిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 80 కోట్ల షేర్ ను .. 162 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.

 టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో 156 కోట్ల గ్రాస్ వసూళ్లతో 'శ్రీమంతుడు' రెండవ స్థానంలోను .. 164 కోట్ల గ్రాస్ తో 'ఖైదీ నెంబర్ 150' మొదటిస్థానంలో వున్నాయి. ఇప్పటికే 'శ్రీమంతుడు' రికార్డును 'జై లవ కుశ' తుడిచిపెట్టేసింది. ఇక 'ఖైదీ నెంబర్ 150' రికార్డుకు చేరువలో ఉండటంతో, ఆ రికార్డును ఈ సినిమా అధిగమిస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఎన్టీఆర్ కి గల క్రేజ్ .. మూడు విభిన్నమైన పాత్రలతో .. డిఫరెంట్ లుక్స్ తో ఆయన చూపిన నట విన్యాసమే ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News