mohanbabu: హీరోగా .. విలన్ గా మోహన్ బాబు ద్విపాత్రాభినయం!

  • ఒకప్పుడు విలన్ గా మెప్పించిన మోహన్ బాబు 
  • ఆ తరువాత స్టార్ హీరోగా ఒక వెలుగు 
  • తాజా చిత్రంగా తెరకెక్కుతోన్న 'గాయత్రి'
  • కీలకపాత్రలో మంచు విష్ణు    

కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రలను ఎక్కువగా పోషించిన మోహన్ బాబు, ఆ తరువాత హీరోగా తన సత్తాను చాటుకున్నారు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు ఒక సినిమాలో అటు హీరోగానూ .. ఇటు విలన్ గాను కనిపించనుండటం విశేషం. ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోన్న మోహన్ బాబు, ప్రస్తుతం మదన్ దర్శకత్వంలో 'గాయత్రి' సినిమా చేస్తున్నారు.

 ఈ సినిమాలో హీరోగా .. విలన్ గా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చాలాకాలం తరువాత ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. 'మేడ మీద అబ్బాయి' లో కథానాయికగా చేసిన నిఖిలా విమల్ .. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. ఇక మంచు విష్ణు కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

More Telugu News