nagarjuna: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న 'రాజుగారి గది 2' జోరు

  • హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'రాజుగారి గది 2'
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఎమోషనల్ కంటెంట్
  • లాభాలు తెచ్చిపెట్టిన శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ .. డిజిటల్ రైట్స్

   

నాగార్జున కథానాయకుడిగా 'రాజుగారి గది 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోటు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తరువాత రెండు రోజుల్లోను అదే జోరును కొనసాగించింది.

 తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లోను ఈ సినిమా 9.52 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది హారర్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ .. ఇందులో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా వుంది. ఆ ఎమోషనల్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి బాగా హెల్ప్ అయింది. ఆ కంటెంట్ వాళ్లకి బాగా కనెక్ట్ కావడం కలిసొచ్చింది. అందువల్లనే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని అంటున్నారు. ఇక శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ పరంగా ఈ సినిమా ఆల్రెడీ లాభాలు తెచ్చిపెట్టడం విశేషం.       

More Telugu News