yuvraj singh: యువరాజ్, రైనాల జీవితాలను కోహ్లీ సర్వనాశనం చేశాడు: కేఆర్కే

  • యువీ, రైనా మీ కెరియర్ ను కోహ్లీ నాశనం చేశాడు
  • ఇక కామెంట్రీ చెప్పుకోండి
  • వైరల్ అవుతున్న కేఆర్కే ట్వీట్

న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో యువరాజ్ సింగ్, సురేష్ రైనాలకు స్థానం కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురేష్ రైనా తన చివరి టీ20 మ్యాచ్ ను ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ పై ఆడాడు. వెస్టిండీస్ లో జరిగిన సిరీస్ సందర్భంగా యువరాజ్ తన చివరి మ్యాచ్ ను ఆడాడు. ఆ తర్వాత జట్టులో వీరికి స్థానం దొరకలేదు. ఫిట్ నెస్ అంశాల ఆధారంగా వీరికి జట్టులో స్థానం కల్పించలేదు.

ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) విరుచుకుపడ్డారు. యువీ, రైనాల కెరీర్ ను కోహ్లీ నాశనం చేశాడంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా యువీ, రైనాలను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. "యువరాజ్, రైనా మీరు ఇంట్లో కూర్చునేలా కోహ్లీ చేశాడు. ఏం పర్వాలేదు. కామెంట్రీ చెప్పుకోండి"

More Telugu News