ys jagan: గన్నవరంలో జగన్ కు ఘన స్వాగతం.. విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లనున్న జగన్

  • పార్టీ బీసీ సెల్ సమావేశంలో పాల్గొననున్న జగన్
  • బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • చేనేత కార్మికులకు భరోసా కల్పించేందుకు అటు నుంచి ధర్మవరంకు జగన్

వైసీపీ అధినేత జగన్ గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు జగన్ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ బీసీ సెల్ సమావేశం జరగనుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వారి వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి వైసీపీ బీసీ విభాగం నేతలు హాజరుకానున్నారు. మరోవైపు, ధర్మవరంలో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేనేత కార్మికులు నెల రోజులకుపైగా దీక్షను కొనసాగిస్తున్నారు. వారికి భరోసా కల్పించేందుకు జగన్ ధర్మవరం వెళ్లనున్నారు. 

More Telugu News