delhi: మిత్రుడిని ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిన వైనం!

  • బార్ లో పని చేస్తున్న విపిన్ జోషి, సంజయ్ మండల్
  • బాదల్ మండల్ ఇంట్లోని ఫ్రిజ్ లో విపిన్ జోషి శరీర భాగాలు 
  • పరారీలో వున్న బాదల్ 

 బార్ టెండర్ గా పనిచేసే ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంట్లోని ఫ్రిజ్ లో ముక్కలు ముక్కలుగా మారిపోయిన ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని సైదులాజబ్ ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి భరించరాని దుర్గంధం వెలువడుతోందని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ ఓ గదిలోని ఫ్రిజ్ లో ఒక వ్యక్తి శరీర భాగాలు కంటబడడంతో షాక్ తిన్నారు.

దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, ఢిల్లీలోని సాకేత్‌ ప్రాంతంలోని గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ బార్‌ లో పనిచేసే విపిన్‌ జోషి (29) ని చంపి ఫ్రిజ్ లో పెట్టారని గుర్తించారు. విపిన్ జోషితో పాటు ఆయన స్నేహితుడు, సహోద్యోగి అయిన బాదల్‌ మండల్‌ కూడా ఆ బార్ లో పని చేస్తున్నాడు. బార్ కు దగ్గర్లోని సైదులాజబ్ ప్రాంతంలోని ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. వారిద్దరూ విధులు ముగించుకుని బాదల్ మండల్ ఇంటికి వెళ్లారు. అక్కడే వారిద్దరూ మద్యం తాగారు. అనంతరం మండల్ అదృశ్యం కాగా, విపిన్ జోషి మాత్రం రిఫ్రిజిరేటర్‌ లో ముక్కలుముక్కలై కనిపించాడు. దీంతో పరారీలో ఉన్న బాదల్‌ మండల్‌ కోసం గాలింపు చేపట్టారు.

More Telugu News