పళనిస్వామి: సీఎం పళనిస్వామిని కలిసిన స్టార్ హీరో విజయ్!

  • తమిళనాడులో వినోదపు పన్ను తగ్గింపుపై పళనిస్వామికి విజయ్ ధన్యవాదాలు
  • విజయ్ ‘మెర్సల్’ సినిమాకు తొలగిన అడ్డంకి
  • ఈ నెల 18న విడుదల కానున్న ‘మెర్సల్’

తమిళనాడు సీఎం పళనిస్వామిని స్టార్ హీరో విజయ్ కలిశాడు. చెన్నైలోని పళనిస్వామి నివాసానికి విజయ్ ఈరోజు వెళ్లాడు. స్థానిక వినోదపు పన్నును 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించినందుకు పళనిస్వామికి ధన్యవాదాలు చెప్పినట్టు తెలుస్తోంది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్  (టీఎఫ్ పీసీ), సినీ సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, స్థానిక వినోదపు పన్ను తగ్గించకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి కొత్త సినిమాలను విడుదల చేయమని టీఎఫ్ పీసీ హెచ్చరించడంతో తమిళ ప్రభుత్వం దిగొచ్చింది. దీంతో, ఈ నెల 18న విడుదల కావలసిన విజయ్ త్రిపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘మెర్సల్’ విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రం తెలుగులో ‘అదిరింది’ పేరిట రిలీజవుతోంది. ఇందులో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యా మీనన్ నటించారు.

More Telugu News