kodanda ram: కోదండరామ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు!

  • అమరవీరుల స్ఫూర్తి యాత్రకు సిద్ధమైన కోదండరామ్
  • ఇంటివద్దే అడ్డుకున్న పోలీసులు
  • హోం మంత్రిని కలిసేందుకు జేఏసీ నేతల ప్రయత్నాలు

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు నుంచి వరంగల్ జిల్లాలో తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రను నిర్వహించేందుకు జేఏసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, స్ఫూర్తి యాత్రకు ప్రభుత్వం ఒప్పుకోని పక్షంలో... జేఏసీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు. మరోవైపు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

More Telugu News