వైసీపీ: నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు!

  • పారిశ్రామికవేత్త రమేష్ ఇంటిపై దాడి కేసు 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • చంద్రమౌళి, అతని అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

వెల్దుర్తి పారిశ్రామికవేత్త రమేష్ ఇంటిపై దాడి కేసులో నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు చంద్రమౌళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రమౌళితో పాటు అతనికి సహకరించిన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఐజయ్య కుమారుడు చంద్రమౌళి తన అనుచరులతో కలిసి పారిశ్రామికవేత్త రమేష్ ఇంటిపై ఇటీవల దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. వ్యాపారలావాదేవీల్లో భాగంగా డబ్బులు ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ బాధితుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

More Telugu News