naga chaitanya: చైతూ, సమంతల రిసెప్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న చైతూ తల్లి!

  • రెండు సార్లు జరగనున్న చైతూ సమంతల రిసెప్షన్
  • మొదటిది చెన్నైలో, రెండోది హైదరాబాదులో
  • చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్న చైతూ తల్లి

టాలీవుడ్ కొత్త జంట నాగచైతన్య, సమంతల వివాహం రెండు సార్లు జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం జరిపారు. గోవాలో జరిగిన ఈ పెళ్లిళ్లు సింపుల్ గానే జరిగాయి. అయితే, హైదరాబాదులో నిర్వహించబోయే రిసెప్షన్ ను మాత్రం భారీ ఎత్తున జరపాలని నాగార్జున భావిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ మొదటి వారంలో జరగనున్న ఈ రిసెప్షన్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.

అయితే పెళ్లిమాదిరే వీరి రిసెప్షన్ కూడా రెండు సార్లు జరగబోతోంది. నాగచైతన్య తల్లి లక్షి చెన్నైలో ఉంటారు. దీంతో తన కొడుకుకోడళ్లను అక్కడకు తీసుకెళ్లి రిసెప్షన్ నిర్వహించాలనే భావనలో ఆమె ఉన్నారట. ఈ నెలాఖరులోగానే ఈ వేడుక జరగనుంది. ఈ ఫంక్షన్ కు దగ్గుబాటి బంధుగణమంతా తరలి వెళ్లనుంది.

More Telugu News