ఇంట్లోకి వరదనీరు చేరిందా?... దానిని ఉప్పుగా మార్చి పారేయండి...!: బెంగళూరు విద్యార్థుల చిట్కా
- బెంగళూరు స్కూలు విద్యార్థుల ఘనత
- వర్షాకాలంలో ఇంట్లో చేరిన నీటిని ఉప్పుగా మార్చి పారబోయమంటున్న విద్యార్థులు
- నీరు ఉప్పుగా మారడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే
నీటిని ఎత్తిపారేయడం కష్టం కనుక.. ఇంట్లో చేరిన నీటిని ఉప్పుగా మార్చేసి, ఆ ఉప్పుని బయటపారేయండని సలహా ఇస్తున్నారు. ఇంట్లో చేరిన నీరు ఉప్పుగా మారేందుకు పట్టే సమయం కేవలం ఐదు నుంచి పది నిమిషాలని వారు చెబుతున్నారు. కేవలం 70 నుంచి 80 రూపాయల విలువ చేసే సోడియం పాలీ క్రైలేట్ ను ఇంట్లోకి చేరిన వరదనీటిలో రెండు లేదా మూడు టీస్పూన్లు వేస్తే ఆ నీరు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఉప్పుగా మారుతుందని, దానిని ఎత్తి బయట పారేయడం సులువని స్కూలు విద్యార్థులు చెబుతున్నారు.