jio: పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు ఎయిర్‌టెల్ మ‌రో ఆఫ‌ర్‌

  • జియో ధ‌న్ ధనా ధ‌న్‌కి పోటీగా
  • రూ. 999కే అప‌రిమిత లోక‌ల్ కాల్స్‌, 50జీబీ డేటా
  • పాత‌, కొత్త క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా వ‌ర్తింపు

మార్కెట్లోకి జియో వ‌చ్చాక ఇత‌ర టెలికాం సంస్థ‌ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ముఖ్యంగా ఎక్కువ మంది వినియోగ‌దారులు ఉన్న ఎయిర్‌టెల్ ప‌రిస్థితి చెప్ప‌న‌క్క‌ర‌లేదు. త‌మ వినియోగ‌దారుల‌ను కాపాడుకోవ‌డానికి ఎయిర్‌టెల్ అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. జియో ప్ర‌వేశ‌పెడుతున్న ప్ర‌తి ఆఫ‌ర్‌కి కౌంట‌ర్‌గా ఒక కొత్త ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ఇప్పుడు కొత్త‌గా పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల కోసం మ‌రో ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. రూ.999కే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 50 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్‌ పాత, కొత్త పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు వర్తిస్తుంది. ఇప్పటికే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.999 ప్లాన్‌ అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌ను అందిస్తోంది.

దీంతో పాటు ఎయిర్‌టెల్ మ‌రికొన్ని ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. రూ.799 ప్లాన్ పేరుతో 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ కేవలం ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మాత్రమే. దీంతో పాటు 4జీ వినియోగదారుల కోసం రూ.1,399కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News