akash puri: 'మెహబూబా' షూటింగ్ కి ముహూర్తం పెట్టింది బాలయ్యే!

  • ఆకాశ్ పూరి హీరోగా 'మెహబూబా
  • 'హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు షూటింగ్ మొదలు
  • కథానాయికగా నేహా శెట్టి  

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందిస్తున్న 'మెహబూబా' చిత్రాన్ని ఈ రోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్ లో లాంచ్ చేసిన సంగతి విదితమే. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును కూడా మొదలెట్టేశారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమా షూటింగుకు ముహూర్తం పెట్టింది బాలకృష్ణ అనేది తాజా సమాచారం.

'పైసా వసూల్' సినిమా నుంచి బాలకృష్ణ - పూరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ కారణంగానే బాలకృష్ణ తన 103వ సినిమాను పూరి దర్శకత్వంలో చేయనున్నాడు. బాలకృష్ణకి ముహూర్తాలపై నమ్మకం ఎక్కువ .. అందువలన ఆయన ఆకాష్ పూరి మూవీ షూటింగ్ కి ముహూర్తం నిర్ణయించారట. ఆ సమయానికే షూటింగును ప్రారంభించామనీ .. బాలకృష్ణ ముహూర్తాన్ని నిర్ణయించడమే ఆశీర్వాదమని యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News