talasani sreenivas yadav: తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

  • తలసాని ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొన్న లారీ
  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలు
  • కీసర వద్ద ప్రమాదం

తెలంగాణ పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం దెబ్బతిన్నప్పటికీ, తలసాని మాత్రం ఎలాంటి గాయాలు కాకుండానే క్షేమంగా బయటపడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఇదే వాహనంలో ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. కీసరలో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

More Telugu News