charan: 'రంగస్థలం' కోసం అదిరిపోయే ఐటమ్ సాంగ్!

  • షూటింగ్ దశలో 'రంగస్థలం'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఐటమ్ సాంగ్ కి ట్యూన్స్ రెడీ
  • ఈ పాటకు పూజా హెగ్డే ఎంపిక   

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. హైదరాబాద్ లో వేసిన భారీ విలేజ్ సెట్ లోను కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందనీ .. ఆ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది.

 ఈ ఐటమ్ సాంగ్ కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్యూన్స్ నుంచి సుకుమార్ రెండు ట్యూన్స్ ను ఫైనల్ చేశాడట. ఈ రెండింటిలో ఒక ట్యూన్ ను ఆయన ఫిక్స్ చేయాల్సి వుంది. ఈ విషయంలో సుకుమార్ .. దేవిశ్రీ నిర్ణయమే ఫైనల్ అంటూ చరణ్ కూడా చెప్పేశాడట. గతంలో సుకుమార్ .. దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఒక రేంజ్ లో దుమ్మురేపేయడమే అందుకు కారణం. ఇక సుకుమార్ .. దేవిశ్రీ కలిసి ఈ సారి కూడా ఐటమ్ సాంగ్ తో అదరగొట్టేయడం ఖాయమనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. 

More Telugu News