samantha: సుశాంత్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం... పేరును వెల్లడించిన నిర్మాతలు!

  • కొత్త చిత్రం పేరు 'చి ల సౌ'
  • టైటిల్ పోస్టర్ విడుదల 
  • నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం 

సుశాంత్ హీరోగా యువ నటుడు రాహుల్ రవీంద్రన్ (సింగర్ చిన్మయి భర్త) దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'చి ల సౌ' అన్న పేరును పెట్టినట్టు, నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా, ఖాళీగా ఉన్న ఓ సింహాసనం, దాని చుట్టూ ఉన్న రుషులు, రాజులు అక్షింతలు చల్లుతుండటం, వేదిక కింద యజ్ఞం జరుగుతున్న పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సిరుణి సినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందించనున్నాడు. భరత్ కుమార్, పులిజాల హరి నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్ రిలీజ్ పోస్టర్ ను మీరూ చూడవచ్చు.


More Telugu News