shankar: ముంబైలో చివరి పాట చిత్రీకరణలో రజనీ '2.0'

  • భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న '2.0'
  • కథానాయికగా ఎమీ జాక్సన్
  • ఈ సినిమాపైనే ఆమె ఆశలు
  • జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

శంకర్ .. రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా '2.0' సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా, ఒక పాట మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రజనీ .. ఎమీ జాక్సన్ కాంబినేషన్లోని ఈ సాంగ్ ను ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో, ఈ రోజు నుంచి చిత్రీకరించనున్నారు. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారని సమాచారం.

ఈ సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట నిలుస్తుందని అంటున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటను, శంకర్ తనదైన శైలిలో చిత్రీకరించనున్నాడు. ఈ ట్యూన్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సాంగ్ కి .. మైఖేల్ జాక్సన్ కి మధ్య ఏదో కనెక్షన్ వుంటుందట. అదేంటన్నది తెరపైనే చూడాలంటూ సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఎమీ జాక్సన్ కెరియర్ స్పీడ్ ను ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి మరి.   

More Telugu News