akash puri: పూరీ తనయుడి 'మెహబూబా' షూటింగ్ అక్కడే మొదలవుతుందట!

  • 'మెహబూబా' కోసం లొకేషన్స్ వేటలో పూరి
  • కథానాయకుడిగా ఆకాష్ పూరి
  • కథానాయికగా నేహా శెట్టి ఎంపిక
  • యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథ    

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని లొకేషన్స్ ను పరిశీలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన కొన్ని లొకేషన్స్ ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఆ లొకేషన్స్ లోనే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు.

ఆ తరువాత పంజాబ్ .. రాజస్థాన్ వంటి ప్రాంతాల్లోను ఈ సినిమా షూటింగును జరపనున్నట్టు సమాచారం. రాజస్థాన్ లో జరిగే షెడ్యూల్ తో షూటింగును ముగించేలా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. 1971లో జరిగిన ఇండియా - పాకిస్థాన్ వార్ నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాతో తెలుగు తెరకి 'నేహా శెట్టి' కథానాయికగా పరిచయమవుతోంది.    

More Telugu News