Mi MIx 2: 6 జీబీ ర్యామ్‌తో వచ్చేసిన షియోమీ ‘ఎంఐ మిక్స్ 2’

  • ర్యామ్‌ను విస్తరించుకుంటూ పోతున్న కంపెనీలు
  • తాజా ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన షియోమీ
  • ధర రూ.35,999

మొబైల్ కంపెనీలు తాము ఉత్పత్తి చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ర్యామ్‌లను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ 6జీబీ ర్యామ్‌తో భారత మార్కెట్లోకి మరో మొబైల్‌ను విడుదల చేసింది. ‘ఎంఐ మిక్స్ 2’ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.35,999. అక్టోబరు 17 నుంచి ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఎంఐ సొంత వెబ్‌సైట్ ఎంఐ డాట్ కామ్‌ల ద్వారా ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని షియోమీ తెలిపింది.

ఎంఐ మిక్స్ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. 5.99 అంగుళాల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ, అవసరం మేరకు పెంచుకునే వెసులుబాటు, 12 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ నూగట్ ఓఎస్, డ్యూయల్ సిమ్ తదితర సదుపాయాలున్న ఈ ఫోన్‌లో 3400 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఉపయోగించారు.
 

More Telugu News