జగన్: జగన్ చెప్పిన వెంటనే రాజీనామా చేస్తాం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధమే
  • ఇప్పుడే రాజీనామా చేయడంలో అర్థం లేదు
  • కేంద్ర మంత్రి జవదేకర్ ని కలిసిన సుబ్బారెడ్డి

ప్రత్యేక హోదా నిమిత్తం తమ పార్టీ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను ఈ రోజు ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జగన్ చెప్పిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని అన్నారు.

ఇప్పుడే రాజీనామా చేయడంలో అర్థం లేదని, తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్ లో మాట్లాడేవారే ఉండరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన తర్వాత, తమ పదవులకు రాజీనామా చేస్తే ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు.

More Telugu News