డీఎస్సీ: తెలంగాణ డీఎస్సీ-2017 మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీవో

  • ఎస్ఈటీ నిబంధనల మేరకు డీఎస్సీ మార్గదర్శకాలు ఖరారు
  • ఫైల్ పై సంతకం చేసిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
  • త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ - 2017కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్ఈటీ నిబంధనల ప్రకారం డీఎస్సీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఈరోజు జీవో విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సంతకం చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, టెట్ వెయిటేజ్, తదితర నిబంధనలను ఈ జీవోలో పేర్కొంది.

 డీఎస్సీకి ఏపీ టెట్, టీఎస్ టెట్, క్వాలిఫై అయిన వారు అర్హులని, జిల్లా స్థానికత ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనున్నట్టు ప్రకటించింది. కాగా, డీఎస్సీ మార్గదర్శకాలను టీఎస్ పీఎస్సీకి చేరిన అనంతరం నోటిఫికేషన్ వెలువడనుంది. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ప్రాతిపదికనే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 8,972 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్నట్టు సమాచారం.

More Telugu News