gv prakash kumar: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ న్యూ మూవీ లాంచింగ్ రేపే!

  • తమిళంలో సెట్స్ పైకి '100% కాదల్' 
  • హీరోగా జీవీ ప్రకాశ్ కుమార్
  • కథానాయికగా షాలినీ పాండే
  • ఆమె ఆశలన్నీ ఈ సినిమాపైనే

తెలుగులో ఈ మధ్యకాలంలో సంచలన విజయాన్ని సాధించిన చిన్న సినిమాలలో 'అర్జున్ రెడ్డి' ఒకటి. ఈ సినిమాలో కథానాయికగా నటించిన షాలిని పాండేకి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తెలుగుతో పాటు ఇతర భాషల నుంచి కూడా ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. అలా ఆమెకి తమిళంలో రూపొందుతోన్న '100% కాదల్' సినిమాలో ఛాన్స్ వచ్చింది.

తెలుగులో ఘనవిజయాన్ని సాధించిన '100% లవ్' సినిమాకి ఇది రీమేక్. సుకుమార్ దర్శకత్వంలో చైతూ .. తమన్నా చేసిన ఈ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమా చంద్రమౌళి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో కథానాయిక పాత్రను షాలిని పాండే పోషించనుంది. ఈ సినిమా షూటింగును రేపు ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా హిట్ కొడితే షాలిని పాండే అక్కడ కూడా బిజీ కావడం ఖాయం .. అందుకే ఆమె ఆశలన్నీ ఈ సినిమాపైనే.       

More Telugu News