malala: ఆక్స్‌ఫ‌ర్డ్‌లో మొద‌టి రోజు త‌ర‌గ‌తుల‌కు హాజ‌రైన మ‌లాలా

  • ట్వీట్ చేసిన నోబెల్ గ్ర‌హీత‌
  • కాల్పుల ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్న యూసుఫ్ జాయ్‌
  • అభినంద‌న‌లు తెలిపిన నెటిజ‌న్లు

పాకిస్థానీ సామాజిక వాది, నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూసుఫ్ జాయ్ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో మొద‌టి రోజు త‌ర‌గతుల‌కు హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా త‌న మీద జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ఆమె గుర్తుచేసుకుంది. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది. `ఐదేళ్ల క్రితం ఆడ‌పిల్ల‌ల విద్య కోసం గొంతెత్తే ప్ర‌య‌త్నంలో నేను కాల్పుల‌కు గుర‌య్యాను. అదే నేను ఇవాళ ఆక్స్‌ఫ‌ర్డ్‌లో తొలి త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యాను` అని అర్థం వ‌చ్చేలా ఆమె ట్వీట్ చేసింది. త‌న పుస్త‌కాలు, ల్యాప్‌టాప్ ఫొటోను మ‌లాలా షేర్ చేసింది. నెటిజ‌న్లంద‌రూ ఆమెకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అంతేకాకుండా ఈ ట్వీట్‌కు విప‌రీతంగా లైకులు, రీట్వీట్లు కురిపిస్తున్నారు.

More Telugu News