akshara hassan: ఈ ఇద్దరిలో ఒకరికి 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో హీరోయిన్ గా ఛాన్స్!

  • తమిళ రీమేక్ గా 'అర్జున్ రెడ్డి'
  • హీరోగా విక్రమ్ తనయుడు 'ధృవ్'
  • హీరోయిన్స్ కోసం అన్వేషణ
  • అక్షర హాసన్, శ్రియా శర్మ పేర్లు పరిశీలన    

తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' .. ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలను .. హీరోలను ఆకర్షించింది. దాంతో ఆయా భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి వాళ్లంతా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలోను రీమేక్ చేస్తున్నారు.

 సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' ఈ సినిమాలో కథానాయకుడిగా నటించనున్నాడు. తమిళ తెరకి ఈ సినిమాతోనే ఆయన పరిచయమవుతున్నాడు. బాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. కథానాయిక పాత్ర కోసం అక్షర హాసన్ .. 'నిర్మలా కాన్వెంట్' అమ్మాయి శ్రియా శర్మ పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది త్వరలోనే తేలుతుంది.  

More Telugu News