dera baba: నా దగ్గర ఏముందని జరిమానా కట్టాలి?: హైకోర్టులో డేరా బాబా

  • ఆస్తులన్నీ అటాచ్ చేశారు.. డబ్బు కట్టలేనన్న డేరా బాబా
  • కట్టాల్సిందేనన్న హైకోర్టు
  • గుర్మీత్ కు యావజ్జీవ శిక్ష విధించాలంటూ బాధితుల పిటిషన్

అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే, జరిమానా చెల్లించలేనని ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టుకు తెలిపారు. డబ్బు కట్టకపోవడానికి కారణమేంటంటూ ధర్మాసనం ప్రశ్నించగా... డేరాబాబా తరపు వాదిస్తున్న లాయర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

 డేరా సంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని... ఈ నేపథ్యంలో ఆయన రూ. 30 లక్షలను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అయితే, ఈ వాదనను హైకోర్టు కొట్టిపారేసింది. పంచకుల కోర్టు ఆదేశించిన విధంగా రెండు నెలల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని అత్యాచార బాధితులకు చెల్లించనున్నారు. మరోవైపు, డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష సరిపోదని... యావజ్జీవ కారాగార శిక్షను విధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వీరు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా పంజాబ్-హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది.

More Telugu News