tamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కంగనాను కలుస్తానంటున్న తమన్నా 
  • ధన్సిక హీరోయిన్ గా మొదలైన 'మేళా'
  • రచయిత శ్రీధర్ దర్శకత్వంలో 'బృందావనమది అందరిది'
  • 'ఓవర్ యాక్షన్'తో వస్తున్న శివనాగేశ్వరరావు

*  బాలీవుడ్ తార కంగనా రనౌత్ ని కలవాలని అనుకుంటోంది మిల్కీ వైట్ భామ తమన్నా. హిందీలో కంగనా చేసిన 'క్వీన్' చిత్రం తెలుగు రీమేక్ లో తమన్నా నటిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'క్వీన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. కంగనా చాలా గొప్పగా నటించింది. తెలుగు వెర్షన్ షూటింగ్ మొదలయ్యే లోపు ఆమెను కలసి మాట్లాడాలనుకుంటున్నాను' అని చెప్పింది తమన్నా.
*  'కబాలి' చిత్రంలో రజనీ కాంత్ కు కూతురుగా నటించిన ధన్సిక కథానాయికగా తెలుగులో ఓ సినిమా మొదలైంది. 'మేళా' పేరుతో కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభమైంది.
*  ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనమది అందరిది' చిత్రం పూజా కార్యక్రమాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా నూతన నటీనటులు నటిస్తారు.
*  గతంలో పలు వినోదాత్మక చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు తాజాగా 'ఓవర్ యాక్షన్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే 'భూమి గుండ్రంగా వుంది' పేరిట ఓ వెబ్ సీరీస్ కు కూడా ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.    

More Telugu News