Pawan kalyan: 'ఆ మంత్రుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియదు... సంతోషం!' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన ప‌వ‌న్‌!

  • అశోక్ గ‌జ‌ప‌తిరాజు, పితాని పేర్ల ప్ర‌స్తావ‌న‌
  • త‌న గురించి వారికి తెలియ‌ద‌ని పేర్కొన్న హీరో
  • రీట్వీట్ చేస్తున్న అభిమానులు

కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌ల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. `అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌దు.. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలియ‌దు.. సంతోషం` అని ప‌వ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌ను ప‌వ‌న్ అభిమానులు విప‌రీతంగా రీట్వీట్ చేస్తున్నారు. `వాళ్లు మీ ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌మ‌ను తామే ప‌రిచ‌యం చేసుకునే రోజు త్వ‌ర‌లో వ‌స్తుంది అన్నా!`, `నువ్వేంటో చూపించే టైమ్ వ‌చ్చింది అన్నా!` అంటూ ప‌లువురు అభిమానులు ఈ ట్వీట్‌పై కామెంట్ చేశారు.

More Telugu News