prabhas: 'సాహో'లో ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుంది : ప్రభాస్

  •  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 'సాహో' షూటింగ్
  •  ఈ సినిమాను గురించి ప్రస్తావించిన ప్రభాస్
  •  కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్
  •   హైలైట్ గా నిలిచే రొమాంటిక్ సీన్స్          

ప్రభాస్ తదుపరి చిత్రంగా 'సాహో' తెరకెక్కుతోంది. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రభాస్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఘాటైన రొమాన్స్ కూడా ఉందని ఆయన చెప్పాడు. ఇందులోని రొమాంటిక్ సీన్స్ కూడా ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అన్నాడు. ప్రభాస్ చెప్పిన దానిని బట్టి ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో కంటే ఘాటైన రొమాన్స్ ఈ సినిమాలో వుండనుందనీ, అందుకే శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారనే విషయం అర్థమవుతోంది. మొత్తానికి ప్రభాస్ ఈ సారి యాక్షన్ తోనే కాదు .. రొమాన్స్ తోను రెచ్చిపోతాడన్న మాట.         

More Telugu News