samantha: రెండు స్పెషల్ ఫ్లయిట్లలో గోవాకు దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు

  • మధ్యాహ్నం బయలుదేరనున్న విమానాలు
  • బంధుగణానికి స్టార్ హోటల్ లో బస
  • రేపు సమంత, నాగ చైతన్యల వివాహం

రేపు ఒకటి కానున్న నాగచైతన్య, సమంతల వివాహ వేడుకకు హైదరాబాద్ నుంచి అక్కినేని దగ్గుబాటి కుటుంబసభ్యులు రెండు ప్రత్యేక విమానాల్లో గోవాకు బయలుదేరనున్నారు. ఈ మధ్యాహ్నం ఇవి శంషాబాద్ నుంచి గోవాకు బయలుదేరనున్నాయి. ఈ విమానాల్లో నాగార్జున, వెంకటేష్ బంధుగణమంతా గోవాకు చేరనుంది. ఇక గోవాలోని ప్రసిద్థ 'డబ్ల్యూ' అనే స్టార్ హోటల్ లో వీరందరికీ బస ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే గోవాకు చేరిన చైతూ, నాగ్ ముఖ్య బంధువులు, నాగార్జున తదితరులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇక పెళ్లి అంటే ఏ అమ్మాయికైనా చెప్పలేనంతగా ఉద్వేగం ఉంటుందని, తాను కూడా అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నానని సమంత చెబుతోంది. ఇక పెళ్లయిన తరువాత కూడా తన జీవితంలో పెద్ద మార్పులు వస్తాయనేమీ భావించడం లేదని చెప్పిన శామ్, తన స్నేహితుడే భర్త కానుండటంతో ముందుముందూ ఆనందంగానే జీవితం సాగుతుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

More Telugu News