prabhas: 'సాహో'తో పాటు నెక్స్ట్ మూవీ పూర్తి చేయనున్న ప్రభాస్!

  •  'సాహో' షూటింగుతో బిజీగా వున్న ప్రభాస్ 
  •  'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో నెక్స్ట్ మూవీ
  •  ఫిబ్రవరి నుంచి ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్
  •  తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలను పూర్తి చేయనున్న  ప్రభాస్ 

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'సాహో ' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. 'జిల్' దర్శకుడు రాధాకృష్ణకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

 ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో వున్నారు. ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే .. ఆ తరువాత సినిమా షూటింగులోను ప్రభాస్ పాల్గొననున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీగా వుంటారు. 'సాహో'తో పాటు ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేయనున్నాడు. 

More Telugu News