ntr: నైజామ్ లో దుమ్మురేపేసిన ' జై లవ కుశ'

  •  తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు
  •  ముఖ్యంగా నైజామ్ లో అత్యధిక వసూళ్లు
  •  ఇంతవరకూ అక్కడ 15 కోట్ల షేర్ వసూలు
  •  ఖుషీ అవుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్    

యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ చేసిన 'జై లవ కుశ' .. విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయ విహారం చేస్తోంది. వారం గ్యాప్ లోనే 'స్పైడర్' .. 'మహానుభావుడు' సినిమాలు థియేటర్స్ కి వచ్చినా, 'జై లవ కుశ' సినిమా వసూళ్లపై పెద్దగా ప్రభావం పడలేదు. ఇంకా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది.

ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 15 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఎన్టీఆర్ కెరియర్లోనే నైజామ్ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఈ సినిమాకి మూడవ స్థానం దక్కడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తదుపరి చిత్రం కోసం త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే ఆనందకరమైన క్షణాల కోసం వాళ్లంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  

More Telugu News