ఏపీ: ఏపీలో సమాచార కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

  • ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేష్
  • ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు పంపాలి
  • ఏపీ ముఖ్య కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రహి  

ఏపీలో సమాచార కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్య కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రహి మాట్లాడుతూ, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులు అందజేయాలని కోరారు. వ్యక్తిగతంగా, రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాలని, ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు పంపాలని తెలిపారు.

More Telugu News