venkaiah naidu: రైతు బిడ్డను కాబట్టే ఈ కార్యక్రమానికి వచ్చా: వెంకయ్యనాయుడు

  • నేను కూడా రైతు బిడ్డనే
  • రైతుల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది
  • కృష్ణా జిల్లాలో వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్టు నిర్వహించిన రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఉప రాష్ట్రపతిని అయినప్పటికీ... తాను కూడా రైతు బిడ్డనేనని చెప్పారు. అందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు. రైతుల కోసం, వారి ఉన్నతి కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

More Telugu News