Lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'త్రిపుర హెయిరాయిల్'కు లావణ్య ప్రచారం
  • హిందీ చిత్రంలో నటిస్తున్న అమల 
  • 'ఒక్కడు మిగిలాడు' విడుదలకు రెడీ 
  • కార్తీ, రకుల్ జంటగా మరో చిత్రం

*  తెలుగు సినిమాలలో బిజీగా వున్న లావణ్య త్రిపాఠి చేతికి కమర్షియల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'త్రిపుర' హెయిరాయిల్ ఉత్పత్తికి ఈ చిన్నది బ్రాండ్ అంబాసడార్ గా ఎంపికైంది. ఆయుర్వేద ఉత్పత్తులంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ కోవలోకే వచ్చే త్రిపుర హెయిరాయిల్ కి ప్రచారకర్తగా పనిచేస్తున్నందుకు ఆనందంగా వుందని చెప్పింది.
*  నాగార్జున భార్య, ప్రముఖ నటి అమల మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటోంది. ఈ విషయాన్ని నాగార్జున మీడియాకు తెలిపారు. సినిమా నిర్మాణంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను తెలుసుకోవడానికి ఆమె సినిమాలలో నటించడానికి నిర్ణయించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తోందని తెలిపారు.
*  మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'ఒక్కడు మిగిలాడు' చిత్రం సీజీ పనులతో పాటు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయం గురించి మనోజ్ చెబుతూ, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపాడు.
*  తాజాగా 'ఖాకి' సినిమాలో జంటగా నటించిన కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ మరో సినిమాలో కూడా జంటగా నటించనున్నారు. నూతన దర్శకుడు రజత్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. కాగా, 'ఖాకి' వచ్చే నెల 17న విడుదల కానుంది.     

More Telugu News