Rahul Gandhi: రాహుల్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి.. ఈ నెల 25నే ముహూర్తం!

  • ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ
  • దీపావళి తర్వాత రాహుల్ కి పగ్గాలు 
  • రెండు రోజుల క్రితమే వెల్లడించిన సచిన్ పైలట్ 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.

ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, రాహుల్ గాంధీ దీపావళి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నట్టు రాజస్థాన్‌కు చెందిన ఆ పార్టీ నేత సచిన్ పైలట్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

More Telugu News