Train crushes: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ... రైలు ఢీ.. ఛిద్ర‌మైపోయిన ముగ్గురు యువకుల శరీరాలు

  • బెంగళూరుకి సమీపంలో దుర్ఘటన 
  • ప్రాణం తీసిన స్నేహితుల సరదా

బెంగళూరుకి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని బిడాడీలో రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులు ముగ్గురూ క‌లిసి రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ మోజులో రైలును కూడా పట్టించుకోలేద‌ని వారి మృతదేహాలు ఛిద్ర‌మైపోయాయ‌ని పోలీసులు చెప్పారు. మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామ‌ని తెలిపారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. భార‌త్‌లో సెల్ఫీ మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతోంది. ప్ర‌మాద‌క‌ర ప్ర‌దేశాల్లో, క్రూర జంతువుల‌తో సెల్ఫీలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి అత్య‌ధిక‌ లైకులు, కామెంట్లు సంపాదించాల‌ని యువ‌త భావిస్తోంది. ఈ మోజుతోనే సెల్ఫీలు తీసుకుంటూ ప్ర‌మాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. 

More Telugu News