minimum charges: క‌నీస ఛార్జీల‌ను త‌గ్గించిన‌ ఎయిర్ ఏషియా... అక్టోబ‌ర్ 2 నుంచి 15లోగా బుకింగ్‌లు

  • స్వదేశీ మార్గాల్లో కనీస చార్జీ రూ. 1299
  • విదేశీ మార్గాల్లో రూ. 2399
  • వెబ్‌సైట్‌, యాప్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఏషియా మ‌రో ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. విమాన ప్ర‌యాణ క‌నీస ఛార్జీల‌ను తగ్గించి విమాన ప్ర‌యాణాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసింది. ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం స్వ‌దేశీ మార్గాల్లో క‌నీస ఛార్జీలు రూ. 1299 నుంచి ప్రారంభం అవుతుండ‌గా, విదేశీ మార్గాల్లో రూ. 2,399 నుంచి మొద‌ల‌వుతాయి.

అయితే ఈ ఆఫ‌ర్ వ‌ర్తింపు కోసం అక్టోబ‌ర్ 2 నుంచి 15లోపు టికెట్ల‌ను బుక్ చేసుకోవాలి. నిన్న మొదలైన ఈ ఆఫర్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణాలకు వర్తిస్తుంది. స్వదేశీయంగా హైదరాబాద్‌, కోల్‌కతా, కొచ్చి, న్యూ ఢిల్లీ , రాంచీ, పుణె తదితర మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు, ఇక అంతర్జాతీయంగా కౌలాలంపూర్‌, బాలి, బ్యాంకాక్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ, సింగపూర్‌, ఆక్లాండ్‌ల‌తో పాటు ఆసియాలోని 120 మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫ‌ర్ అందుబాటులో వుంటుంది. ఎయిర్‌ ఏషియా అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా బుక్‌చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫ‌ర్ వర్తిస్తుంది.

More Telugu News