Srinagar: శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు

  • ఈ తెల్లవారుజామున దాడికి దిగిన ఉగ్రవాదులు
  • కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బీఎస్ఎఫ్ ట్రాన్సిట్ క్యాంప్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఓ ఉగ్రవాదిని జవాన్లు కాల్చి చంపారు.

తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ క్యాంపులోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని నిలువరించడంతో క్యాంపస్‌లోని ఓ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారభించారు. జవాన్లు కూడా దీటుగా స్పందిస్తూ, కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రదాడి కారణంగా ఎయిర్‌పోర్టు వైపు వాహనాలను, వ్యక్తులను అనుమతించడం లేదు.

More Telugu News