Mumbai: ముంబై బ్రిడ్జి కూలిన ఘటనలో దారుణం.. ప్రాణాలతో పోరాడుతున్న మహిళపై లైంగిక వేధింపులు, చోరీ!

  • వీరు మనుషులేనా? అనిపించేలా ప్రవర్తన
  • ఆర్తనాదాలు చేస్తుంటే దోచుకెళ్లిన వైనం
  • కాసేపటికే కన్నుమూత

మనుషుల మనసులు ఎంతగా కరుడు గట్టిపోతున్నాయో.. మానవత్వం ఎంతగా కనుమరుగవుతోందో చెప్పేందుకు ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. శుక్రవారం ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జరిగిందీ ఘటన.

ఓ మహిళ కింద పడి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే ఆమెను రక్షించాల్సిన సాటి వ్యక్తులు మానవ మృగాల్లా ప్రవర్తించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ, ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి ఎవరి  దారిన వారు వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు ఎవరినీ కదిలించలేకపోయాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.  
 

More Telugu News