manchu vishnu: మంచు విష్ణు చిత్రంలో ఆసక్తికరమైన కంటెంట్!

  •  ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు 
  •  ముందుగా తమిళ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్
  •  త్వరలో తెలుగు టైటిల్ ఖరారు 
  •  కథానాయికగా సురభి            

మంచు విష్ణు ప్రస్తుతం నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఆయన ఈ సినిమాను చేస్తుండటం విశేషం. తమిళ మార్కెట్ పై దృష్టి పెట్టిన విష్ణు, ఈ సినిమాతోనే అక్కడి ప్రేక్షకుల ముందుకు నేరుగా వెళ్లనున్నాడు.

 జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి ఆయన 'కుర్జల్ 388' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. తాజాగా తమిళ టైటిల్ తో కూడిన ప్రీ లుక్ ను కూడా వదిలాడు. పోస్టర్లో ఓ పాత బంగ్లా .. తాళపత్ర గ్రంధాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాచీన కాలంతో ముడిపడిన కథా వస్తువును ఆయన ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. విష్ణు జోడీగా సురభి అలరించనుంది. కామెడీకి అధిక ప్రాధాన్యతనిచ్చే విష్ణు, ఈ సారి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నే ఎంచుకున్నాడనుకోవచ్చు.         

More Telugu News