rajamouli: రాజమౌళి తరువాతి సినిమా 'మగధీర-2'?

  • బాహుబలి తరువాత ఇంతవరకు ప్రాజెక్టు చేపట్టని రాజమౌళి
  • తదుపరి సినిమా రాంచరణ్ తో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్
  • మగధీరకు సీక్వెల్ తీయాలని ఉందన్న విజయేంద్రప్రసాద్

'బాహుబలి' సినిమా తరువాత తన తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై దర్శకుడు రాజమౌళి ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు. అయితే, ఆయన రాంచరణ్ తో ఓ సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఒక సందర్భంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'మగధీర' సినిమాకు సీక్వెల్ తీయాలని ఉందని అన్నారు.

దీంతో 'మగధీర-2' రూపకల్పనకు రాజమౌళి పూనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ కథనాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కథ కాకపోయినా, రాజమౌళి తరువాతి ప్రాజెక్టు మాత్రం రాంచరణ్ తోనే ఉంటుందని తెలుస్తోంది.  

More Telugu News