baahubali: ప్ర‌ధాని మోదీకి పూర్తి మ‌ద్ద‌తునిస్తాన‌న్న బాహుబ‌లి ప్ర‌భాస్‌

  • స్వ‌చ్ఛ్ భార‌త్‌కే త‌న ఓటు అన్న హీరో
  • క్లీన్ ఇండియా క్యాంపెయిన్ ఆహ్వానంపై స్పందించిన ప్ర‌భాస్‌
  • ఫేస్‌బుక్‌లో వెల్ల‌డి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించిన `స్వ‌చ్ఛ‌త హై సేవ‌` విప్ల‌వానికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు బాహుబ‌లి ప్ర‌భాస్ ప్ర‌క‌టించాడు. దేశాన్ని శుభ్రంగా ఉంచడం ఒక ప‌నిగా కాకుండా అల‌వాటుగా మార్చుకుంటాన‌ని ఆయ‌న ప్ర‌తిజ్ఞ పూనాడు. ఇటీవ‌ల క్లీన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా స్వచ్ఛ్ భార‌త్ ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌చారం చేయాల‌ని కొంత‌మంది ప్ర‌ముఖుల‌కు ప్ర‌ధాని మోదీ వ్య‌క్తిగ‌తంగా లేఖ‌లు రాసిన సంగ‌తి తెలిసిందే.

ఈ లేఖ‌పై స్పందిస్తూ - `స్వ‌చ్ఛ‌త కోసం పాటుప‌డిన మ‌హాత్మాగాంధీ జ‌యంతి త్వ‌ర‌లో రానుంది. ఆ సంద‌ర్భాన్ని అవ‌కాశంగా తీసుకుని స్వ‌చ్ఛ‌త‌కు, ప‌చ్చ‌ద‌నానికి నా వంతు ప్ర‌చారం క‌ల్పించ‌డానికి కృషి చేస్తాను` అని ప్ర‌భాస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్‌, రాజ‌మౌళితో పాటు మ‌రికొంత మంది ప్ర‌ముఖులు ప్ర‌ధాని లేఖ‌కు స్పందిస్తూ త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే.

More Telugu News