atal bihari vajpayee: ఓటర్ లిస్ట్ నుంచి మాజీ ప్రధాని వాజ్ పేయి పేరు తొలగింపు

  • లక్నోలో వాజ్ పేయికి ఓటు
  • 2000లో చివరిసారిగా ఓటు వినియోగించుకున్నారు
  • ప్రస్తుతం బెడ్ కే పరిమితమైన వాజ్ పేయి

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ విషయాన్ని యూపీ రాజధాని లక్నో పురపాలక సంఘం ఒకటో జోన్ జోనల్ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. బనారసీ దాస్ లోని 92/98-1 నంబరు ఇంటిలో ఆయన ఓటరుగా నమోదయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో ఆయన చివరిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఓటు వేయలేదు. పదేళ్ల నుంచి ఆయన లక్నోకి రావడం లేదు. ఆయన వయసు 92 ఏళ్లు. ప్రస్తుతం వాజ్ పేయి ఎవరినీ గుర్తించలేని స్థితిలో, బెడ్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. 

More Telugu News