చంద్రబాబు: ఏపీ ఆర్థికంగా బలపడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తాం: సీఎం చంద్రబాబు

  • సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
  • 10వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 11వ పీఆర్సీ కోసం కమిషన్ వేయాలని వినతి
  • సానుకూలంగా స్పందించిన చంద్రబాబు

రాష్ట్రం ఆర్థికంగా బలపడితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు చంద్రబాబును కలిశారు.

10వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 2018 జులై 1 నుంచి అమలు చేయాల్సిన 11వ పీఆర్సీ కోసం కమిషన్ వేయాలని ఈ సందర్భంగా వారు విఙ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, ఆర్థికశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారిని కోరారు.

More Telugu News