‘భారత్ వన్ 4జీ’: అతి తక్కువ ధరకి మైక్రోమ్యాక్స్ నుంచి 4జీ ఫీచర్ ఫోన్!

  • జియోకు పోటీ
  • ‘భారత్ వన్ 4జీ’ పేరిట వచ్చేవారం విడుదల
  • రూ.2 వేలకే లభ్యం
  • బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ కూడా ఫ్రీ

ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ రూ.2 వేలకే 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారత్ వన్ 4జీ పేరిట విడుదల కానున్న ఈ ఫోన్లు వచ్చే వారం నుంచే అందుబాటులో ఉంటాయి. తమ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ కూడా ఉచితంగా అందుకోవచ్చని మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఈ ఫోన్ ఫీచ‌ర్ల గురించి స‌మాచారం అందాల్సి ఉంది. రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్లకు మైక్రోమ్యాక్స్  ఫోన్ పోటీ ఇస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మైక్రోమ్యాక్స్‌కి బీఎస్ఎన్ఎల్ కూడా తోడు కావ‌డంతో మైక్రోమ్యాక్స్ భారత్ వన్ 4జీకు మంచి డిమాండ్ రావ‌చ్చ‌ని చెబుతున్నారు.  

More Telugu News